అన్ని తెలుగు వార్తల సమాహారం

ఆస్పత్రిలో పేషెంట్ బెడ్ కింద పాము.. పరుగులు తీసిన రోగులు

 

ప్రసూతి వార్డులో బాలింతలు ఉన్న బెడ్స్ కింద పాము కలకలం రేపింది. దీంతో అక్కడున్న పేషంట్లంతా భయంతో పరుగులు తీశారు. వారందర్నీ మరో వార్డులోకి తరలించారు.


తెలంగాణలో పాములు కలకలం రేపుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పాములు కనిపిస్తూ.. ప్రజల్ని తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇళ్లలోనే, రోడ్లపైనే కాకుండా ఇప్పుడు ఆస్పత్రుల్లో కూాడా పాములు బుస కొడుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ అసుపత్రిలో పాము హల్ చల్ చేసింది. ప్రసూతి వార్డులో పాము ప్రవేశించింది. పేషంట్ల బెడ్ కింద తిరగడంతో దాన్ని చూసిన రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

వార్డులో‌‌ఒక్కసారిగా పాము కనిపించడంతో అక్కడ ఉన్నవాళ్లంతా భయంతో వణికిపోయారు. మరికొందరు అక్కడ్నుంచి పరుగులు తీశారు. దీంతో సమీపంలో ఉన్న స్టోర్ రూము లోకి పాము వెళ్లిపోయింది. దీంతో ఆ వార్డు మొత్తాన్ని ఖాళీ చేయించి అక్కడ ఉన్న రోగుల్ని మరో వార్డులోకి తరలించారు. పాము సంచారంపై రిమ్స్ అధికారులకు రోగులు సమాచారం ఇచ్చారు. ‌పాము‌ను పట్టుకోవడానికి చర్యలు తీసుకున్నారు. అయితే పాము అసుపత్రిలోకి రావడం‌తో పై అధికారులు, సిబ్బంది తీరుపై రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ఆస్పత్రిలో పేషెంట్ బెడ్ కింద పాము.. పరుగులు తీసిన రోగులు ఆస్పత్రిలో పేషెంట్ బెడ్ కింద పాము.. పరుగులు తీసిన రోగులు Reviewed by Manam Telugu Vaaram on 1:34 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.