అన్ని తెలుగు వార్తల సమాహారం

రాజోలులో జనసేన సభ.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. జనసైనికుల పంచ్ అదిరింది

 

రాజోలు నియోజకవర్గంలోని మల్కిపురంలో జరిగే జనసేన సభకు హాజరు కావోద్దంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసైనికులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయనకు నో ఎంట్రీ చెబుతూ పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటుచఏశారు.


ప్రధానాంశాలు:

  • రాజోలులో నేడు జనసేన బహిరంగ సభ
  • సభకు రావొద్దంటూ ఎమ్మెల్యే రాపాకు పంచ్
  • అనేకచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన జనసైనికులు

గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రాపాక వరప్రసాద్. పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ రెండూ చోట్ల ఓడిపోవడంతో ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారాయన. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ మద్దతుదారుడిగా మారిపోయారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలను పక్కనబెట్టి అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌కు జై కొడుతున్నారు. దీంతో రాపాకపై జనసైనికులు కోపంతో రగిలిపోతూ ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు సోషల్‌మీడియాలోనూ ఏకి పారేస్తుంటారు.

తాజాగా రాజోలు నియోజకవర్గంలోని మల్కిపురంలో సోమవారం జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా నాయకులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జనసైనికులు ఎమ్మెల్యే రాపాకకు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ‘బహిరంగ సభకు రాపాకకు ప్రవేశం లేదు.. ఇట్లు.. మీ పల్లకీ మోసిన రాజోలు జన సైనికులు’ అంటూ ఆయన ఫోటోతో తయారుచేసిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్నారు.

తాము ఎంతో కష్టపడి పార్టీ తరపున గెలిపిస్తే అధికార పార్టీకి తొత్తుగా మారాడంటూ జనసైనికులు ఆయనపై పీకల్లోతు కోపంతో ఉన్నారు. ఈ కోవలోనే రాపాకకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తూ అనేకచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారాయి.


రాజోలులో జనసేన సభ.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. జనసైనికుల పంచ్ అదిరింది రాజోలులో జనసేన సభ.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. జనసైనికుల పంచ్ అదిరింది Reviewed by Manam Telugu Vaaram on 1:24 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.