లక్నో: ఉత్తరప్రదేశ్లోదారుణం జరిగింది. శీల పరీక్ష పేరుతో ఓ భర్త తన భార్య మర్మంగాన్ని అల్యూమినియం తీగతో కుట్టేశాడు. రామ్జిల్లాలోని మిలాక్ ప్రాంతంలో శనివారం నాడు ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు శీల పరీక్ష చేస్తానంటూ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో..ఆమెకు తీవ్ర రక్తశ్రామవైంది. బాధ తాళలేక ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు బాధితురాలని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అనుమానం పెంచుకుని నిత్యం ప్రశ్నలతో వేధిస్తుండేవాడని భార్య పోలీసులకు తెలిపింది. ‘ఏకారణం లేకుండానే అతడు నన్ను కొట్టేవాడు. మరోవ్యక్తితో నాకు సంబంధం ఉందని అనుమానించేవాడు. అంతేకాకుండా.. నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని నన్ను కోరాడు. అయితే.. ఇంతదారుణానికి పూనుకుంటాడని అస్సలు ఊహించలేదు అని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. కాగా..బాధితురాలికి రెండేళ్ల క్రితం పెళ్లైందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know