గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ కార్మికులు చెత్త తొలగిస్తుండగా రూ.2 వేలు, రూ.500, రూ.200 నోట్ల కట్టలు కనిపించాయి. ముందు రూ.500 కట్ట బయటకు తీసి దాచిపెట్టారు.
గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లో కరెన్సీ నోట్లు కలకలంరేపాయి. ఎస్బీఐ సమీపంలో సోమవారం పంచాయతీ కార్మికులు చెత్త తొలగిస్తుండగా రూ.2 వేలు, రూ.500, రూ.200 నోట్ల కట్టలు కనిపించాయి. ముందు రూ.500 కట్ట బయటకు తీసి దాచిపెట్టారు. మళ్లీ అనుమానంతో అక్కడ చెత్త తీశారు.. మళ్లీ నోట్ల కట్టలు కనిపించాయి. డబ్బులు చూసి అవాక్కైన కార్మికులు.. ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులు అనుమానంతో వెంటనే సచివాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సచివాలయం సిబ్బంది ఆ చెత్త ఉన్న ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. ఆ కరెన్సీ నోట్లను పరిశీలించి మొదట దొంగ నోట్లుగా భావించారు. కట్టలన్నీ పరిశీలించగా వాటిపై ‘చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’, ‘ఫర్ స్కూల్ జోన్ ఓన్లీ’ అని రాసి ఉండటంతో అవాక్కయ్యారు. అసలు విషయం తెలియడొంతో అందరూ నవ్వుకొని దొరికిన ఆ కట్టలను తిరిగి చెత్తలో పడేసి డంపింగ్ యార్డ్కు తరలించారు. అక్కడ 30 కట్టల వరకు ఉన్నట్లు సచివాలయ గుర్తించారు. ముందు నిజమైన డబ్బు కార్మికులు.. తర్వాత అసలు విషయం తెలిసి నవ్వుకున్నారు.
గుంటూరు: చెత్త తొలగిస్తుంటే బయటపడ్డ నోట్ల కట్టలు.. షాకైన కార్మికులు, తీరా ఆరా తీస్తే!
Reviewed by Manam Telugu Vaaram
on
11:15 AM
Rating:
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know