తిరుమలగిరికి చెందిన యువకుడు టీనేజ్ యువతిని ప్రేమించాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించారు. అమ్మాయికి పెళ్లి వయసు రాగానే చేస్తామని చెప్పినా వినకుండా హద్దులు దాటాడు. చివరికి జైలుపాలయ్యాడు.
సికింద్రాబాద్ గోపాలపురంకి చెందిన టీనేజ్ యువతి(17) ఓ ప్రైవేట్ ఆఫీస్లో పనిచేసేది. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన పెయింటర్ జాన్సన్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. అమ్మాయికి పెళ్లి వయసు రాగానే వివాహం జరిపించాలని నిర్ణయించారు.
అయితే అప్పటి వరకూ ఆగలేకపోయిన జాన్సన్.. కంగారుపడి కటకటాలపాలయ్యాడు. ఈ నెల 17న ఆఫీస్కి వచ్చిన యువతికి మాయమాటలు చెప్పి తిరుమలగిరి తీసుకెళ్లిపోయాడు. ఆఫీస్కి వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాకపోవడంతో భయాందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు తిరుమలగిరిలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లడంతో పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు.
పెళ్లి చేసే వరకూ ఆగలేకపోయిన ప్రియుడు.. చివరికి..
Reviewed by Manam Telugu Vaaram
on
1:36 PM
Rating:
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know