అన్ని తెలుగు వార్తల సమాహారం

ఓ వైపు వ్యాక్సినేషన్.. మరోవైపు కరోనా మరణం.. కలకలం

 

ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసు అధికారి కరోనా సోకి ప్రాణాలు కోల్పోయాడు. వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నప్పటికీ కరోనా

మరణాలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.


లంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో కరోనా మరణం చోటుచేసుకోవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లిన ఏఆర్ ఏఎస్సై బల్లని రాఘవేంద్రకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో వెంటనే ఆయన ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాఘవేంద్ర మృతి చెందారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. రాఘవేంద్ర కరోనా సోకి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.
ఓ వైపు వ్యాక్సినేషన్.. మరోవైపు కరోనా మరణం.. కలకలం ఓ వైపు వ్యాక్సినేషన్.. మరోవైపు కరోనా మరణం.. కలకలం Reviewed by Manam Telugu Vaaram on 3:49 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.