అన్ని తెలుగు వార్తల సమాహారం

తూ.గో: భార్యపై కోపం.. ఆ భర్త చేసిన నిర్వాకంతో అందరూ అవాక్కు, ఎమ్మెల్యే సైతం!

 

డైయిరీఫారం కూడలికి సమీపంలో ఉన్న రాజీవ్‌గృహకల్ప ఓ వివాహిత తన తల్లిదండ్రులతో ఉంటోంది. ఆమె భర్త కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.. ఇద్దరి మధ్య కేసు కూడా నడుస్తోంది.




తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. భార్యపై కోపంతో అతడు చేసిన నిర్వాకంతో అందూ షాకయ్యారు. డైయిరీఫారం కూడలికి సమీపంలో ఉన్న రాజీవ్‌గృహకల్ప ఓ వివాహిత తన తల్లిదండ్రులతో ఉంటోంది. ఆమె భర్త కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.. ఇద్దరి మధ్య కేసు కూడా నడుస్తోంది. ఆమెను కాపురానికి రావాలని భర్త బలవంతం చేస్తున్నాడు.. వ్యసనాలకు బానిసైన అతడి దగ్గరకు వెళ్లేందుకు భార్య నిరాకరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు.
గురువారం ఉదయం తన భార్య నివాసముంటున్న ఫ్లాట్‌ వద్దకు వెళ్లి డోర్‌కర్టెన్‌ను తగలబెట్టాడు. మంటలు వ్యాపించి, వరుస ఫ్లాట్లలో బయట ఉన్న సోఫా, వాషింగ్‌ మెషిన్‌, చీరలు, నాలుగు ద్విచక్ర బైక్‌లు, మరికొన్ని వస్తువులు కాలిపోయాయి. బాధితులు కాకినాడ పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. ఘటనా ప్రదేశాన్ని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పరిశీలించారు.

తూ.గో: భార్యపై కోపం.. ఆ భర్త చేసిన నిర్వాకంతో అందరూ అవాక్కు, ఎమ్మెల్యే సైతం! తూ.గో: భార్యపై కోపం.. ఆ భర్త చేసిన నిర్వాకంతో అందరూ అవాక్కు, ఎమ్మెల్యే సైతం! Reviewed by Manam Telugu Vaaram on 3:55 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.