మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు బ్రేకిచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాల కోసం విరామం తీసుకున్న అతడు.. ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం బాలీవుడ్లో బంపర్ హిట్ అయిన 'పింక్' సినిమాను 'వకీల్ సాబ్' అనే టైటిల్తో రీమేక్ చేస్తున్నాడు. దీనిపై ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మరో పది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ రిలీజ్కు బ్రేకులు పడినట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!
నాయకుడిగా వెళ్లి... లాయర్గా వస్తున్నాడు రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్'తో ముఖానికి మరోసారి మేకప్ వేసుకున్నాడు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ రూపొందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్.. లాయర్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అన్నింటికీ అదిరేలా... వాటితోనే అంచనాలు ‘వకీల్ సాబ్' ప్రకటించినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తోడు ఆరంభంలో వచ్చిన మోషన్ పోస్టర్, ఆ తర్వాత వచ్చిన సినిమాలోని పాటలతో అవన్నీ రెట్టింపు అయిపోయాయి. ఇక, గత సంక్రాంతికి వచ్చిన టీజర్ దీనిపై మరింత ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ మూవీ చర్చనీయాశం అయిపోయింది. తద్వారా బజ్ ఏర్పడింది.
పవన్ క్రేజ్కు తగ్గట్లుగానే...
రికార్డు స్థాయిలో చాలా కాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్నాడు పవన్ కల్యాణ్. దీంతో అతడి కమ్బ్యాక్ మూవీపైనే అందరి దృష్టి ఉంది. అందుకు అనుగుణంగానే బయ్యర్లు కూడా ఈ మూవీపై బాగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో కలిపి రూ. 100 కోట్లకు పైగా పలుకుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఫుల్ జోష్లో అభిమానులు..
షాకింగ్ న్యూస్ మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో కాలంగా వేచి చూస్తోన్న ‘వకీల్ సాబ్' మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. అద్భుతమైన కట్స్తో ఆకట్టుకున్న ఇది.. భారీ స్థాయిలో స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా ఎన్నో రికార్డులు సైతం బద్దలైపోయాయి. ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.
అక్కడ ‘వకీల్ సాబ్' మూవీ రిలీజ్కు బ్రేకులు
పవన్ కల్యాణ్ కమ్బ్యాక్ మూవీ అయిన ‘వకీల్ సాబ్' ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. చిత్ర నిర్మాత అయిన దిల్ రాజు చాలా ప్రాంతాల్లో స్వయంగా సినిమాను రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ చిత్రాన్ని యూరప్ దేశాల్లో విడుదల చేయడం లేదట.
ప్రభుత్వ నిర్ణయమే కారణం.. రికార్డుపై ఎఫెక్ట్
మిగిలిన దేశాలతో పోలిస్తే యూరప్లో కరోనా ప్రభావం ప్రస్తుతం ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ కారణంగానే లోకల్ మూవీలతో పాటు ‘వకీల్ సాబ్' రిలీజ్ కూడా ఆగిపోయింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కొంతమేర తగ్గే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డులపై ప్రభావం పడే అవకాశం కూడా ఉందన్న టాక్ బాగా వినిపిస్తోంది.
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know