అన్ని తెలుగు వార్తల సమాహారం

ప్రకాశం జిల్లా: రైలు పట్టాలపై ప్రేమజంట.. భయంతో వణికిపోయిన స్థానికులు

 

యువకుడు చీమకుర్తి మండలం గుడివాడ గ్రామానికి చెందిన మద్ది వెంకటసాయి కృష్ణగా గుర్తించారు. యువతి స్వస్థలం చీమకుర్తిగా భావిస్తున్నారు. ఒంగోలులో పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్నట్లు తెలుస్తోంది.




ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. నగర శివారు పెళ్లూరు సమీపంలో ప్రేమ జంట రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది. స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. యువకుడు చీమకుర్తి మండలం గుడివాడ గ్రామానికి చెందిన మద్ది వెంకటసాయి కృష్ణగా గుర్తించారు. యువతి స్వస్థలం చీమకుర్తిగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్నట్లు తెలుస్తోంది. ప్రేమజంటకు సంబంధించిన వివరాలపై ఆరా తీసి.. బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తే కారణాలు తెలుస్తాయంటున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ప్రాణాలు తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకాశం జిల్లా: రైలు పట్టాలపై ప్రేమజంట.. భయంతో వణికిపోయిన స్థానికులు ప్రకాశం జిల్లా: రైలు పట్టాలపై ప్రేమజంట.. భయంతో వణికిపోయిన స్థానికులు Reviewed by Manam Telugu Vaaram on 2:29 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.