అన్ని తెలుగు వార్తల సమాహారం

పీఎం కిసాన్ స్కీమ్.. మార్చి 31లోపు ఇలా చేస్తే.. అకౌంట్లో‌కి రూ.4 వేలు!

 

పీఎం కిసాన్ స్కీమ్‌లో ఇంకా చేరలేదా? అయితే మీరు వెంటనే ఈ పథకంలో చేరండి. ఈ నెల చివరిలోగా మీరు ఈ స్కీమ్‌లో చేరితే రెండు విడతల డబ్బును వెంటవెంటనే పొందటానికి ఛాన్స్ ఉంటుంది.



ప్రధానాంశాలు:

  • రైతులకు ఊరట
  • ఈ నెల చివరి కల్లా చేరండి
  • రెండు బెనిఫిట్స్ పొందొచ్చు
  • కేంద్ర ప్రభుత్వం రైతు కోసం అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంచింది. అదే పీఎం కిసాన్ స్కీమ్. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా మోదీ సర్కార్ అర్హులైన రైతులకు డబ్బులు అందిస్తోంది. సంవత్సరానికి రూ.6 వేలు అకౌంట్లలో వేస్తోంది.

    అయితే ఈ రూ.6 వేలు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతోంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతులకు అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 7 విడతల డబ్బును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో వేయనుంది.
అయితే ఇప్పటికీ కూడా పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరని రైతులు ఎవరైనా ఉంటే.. మార్చి 31లోపు చేరితే డబుల్ బెనిఫిట్ పొందొచ్చు. వెంటవెంటనే రూ.2 వేలు పొందే వెసులుబాటు ఉంటుంది. అంటే రూ.4 వేలు పొందొచ్చు. ఇది ఎలానో ఒకసారి తెలుసుకుందాం.

ఏప్రిల్ 1 నుంచి జూలై 31, ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30, డిసెంబర్ 1 నుంచి మార్చి 31.. ఇలా మూడు విడతల డబ్బులు వస్తాయి. మార్చి 31లోపు చేరితే డిసెంబర్ 1 నుంచి మార్చి 31 ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు పొందొచ్చు. తర్వాత ఏప్రిల్ నుంచి జూలై ఇన్‌స్టాల్‌మెంట్ వస్తుంది. అంటే రెండు విడతల డబ్బును వెంటవెంటనే పొందొచ్చు.





పీఎం కిసాన్ స్కీమ్.. మార్చి 31లోపు ఇలా చేస్తే.. అకౌంట్లో‌కి రూ.4 వేలు! పీఎం కిసాన్ స్కీమ్.. మార్చి 31లోపు ఇలా చేస్తే.. అకౌంట్లో‌కి రూ.4 వేలు! Reviewed by Manam Telugu Vaaram on 12:36 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.