‘‘సోషల్ మీడియాలో నాకు ఎలాంటి అధికారిక అకౌంట్స్ లేవు. నా పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ను దయచేసి ఎవరూ ఫాలో కావొద్దు’’ అని హీరో పంజా వైష్ణవ్ తేజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి నా పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ఉపయోగిస్తున్నారు’’ అన్నారు వైష్ణవ్. తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఘనవిజయం అందుకున్న వైష్ణవ్ తేజ్ ద్వితీయ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు.
కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్గా నటించిన ఉప్పెన సినిమా ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వంద కోట్ల మైలురాయిని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సినిమా యూనిట్ విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకుంది.
సోషల్ మీడియాలో నాకు అకౌంట్లు లేవు: 'ఉప్పెన' హీరో
Reviewed by Manam Telugu Vaaram
on
12:18 PM
Rating:
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know