అన్ని తెలుగు వార్తల సమాహారం

పవన్ - రానా మల్టీస్టారర్.. హీరోయిన్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులైతే వేగంగా జరుగుతున్నాయి. ఇక సినిమాలో హీరోలకు జోడిగా నటించబోయే లక్కీ హీరోయిన్స్ ఎవరనే విషయంలో నిర్మాత ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

మలయాళం హిట్ సినిమా అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ మూవీని సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు మాటలు అందిస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి విషయంలో తన నిర్ణయాన్ని కూడా చెబుతున్నాడట. ఇక సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ ను ఫిక్స్ చేశారట.


ఇటీవల రంగ్ దే ప్రమోషన్ లో చిత్ర నిర్మాత వంశీ ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇక మరొక హీరోయిన్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. మొదట పవన్ కు జోడిగా సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకుంటున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. మళ్ళీ ఆమె తప్పుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఇక త్వరలోనే ఈ రూమర్స్ కు ముగింపు పలకాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.


పవన్ - రానా మల్టీస్టారర్.. హీరోయిన్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత! పవన్ - రానా మల్టీస్టారర్.. హీరోయిన్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత! Reviewed by Manam Telugu Vaaram on 7:47 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.